ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో ఒకలా,తెలంగాణాలో ఇంకోలా ... నా వల్ల కాదు అంటున్న నట్టి కుమార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 01:01 PM

 సినిమా రంగం జీవితం ముందు రోజుల్లో ఏమిజరుగుతుందో తెలియని పరిస్థితి లోకి వెళ్ళింది అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే,  తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంచడానికి  ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం అందరికి తెలుసు. ఇటీవల తెలుగు సినిమా  నిర్మాత నట్టి కుమార్ తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు.  టికెట్ ధరలు పెంచటం వల్ల చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.  మరోసారి ఈ విషయంపై మాట్లాడిన  నిర్మాత నట్టి కుమార్ టిక్కెట్ ధరలు ఎక్కువగా  ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తన  సినిమాలను విడుదల చెయ్యడానికి సిద్ధంగా లేను అని  ప్రకటించారు.డబ్బులు పోగొట్టుకోకూడదనే ఉద్దేశ్యంతోనే  ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కొంత  ఖర్చు అయినా మిగులుతుందని  తెలుగు సినిమా నిర్మాత నట్టి కుమార్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa