ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోడి సినిమాలు ఎక్కువ కావడం లాభమా, నష్టమా...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 01:02 PM

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్ దశ నడుస్తుందనే చెప్పాలి. అలానే మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కూడా నడుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం వచ్చే సినిమాల్లో చాల వరకు మల్టీ స్టారర్ సినిమాలు కావడం గమనార్హం. బాల కృష్ణ నటించిన అఖండ , అల్లు అర్జున్ నటించిన పుష్ప , పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ , శర్వానంద్ నటించిన మహా సముద్రం, రాజమౌళి తీసిన పాన్ ఇండియా సినిమా RRR  ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. 


ఐతే  ఇది  ఎప్పుడు కొత్త సంప్రదాయం ఏమి కాదు, నిజానికి ఎన్టీఆర్ ,ANR  ల కాలంలో కూడా ఇలాంటి  సినిమాలు వచ్చినప్పటికీ మధ్య దశలో చిరంజీవి, నాగార్జున, కాలంలో  ఇలాంటి వాటికి అవకాశం రాలేదు. తమ అభిమాన హీరోని చూడటానికి సినిమాకు వెళ్లే వారికి ఒక్కసారిగా రెండో హీరో నటన చూసే అవకాశం కలుగుతుంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అలానే ఒక టికెట్ తోనే రెండు సినిమాలు చూసినంత ఆనందంగా ఉంది అని కూడా అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా , ఎలాంటి పరిణామాలు సినిమా పరిశ్రమ ఎక్కువ కాలం నిలబడటానికి దోహదపడుతుంది అంటున్నారు సినీ వర్గాలు.  


కానీ, చిన్న సినిమా నిర్మాతలు మాత్రం అందరూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే , మరి మా పరిస్థితి ఏమిటి అంటున్నారు . జీవితంలో ఒక్కసారైనా పెద్ద హీరోతో సినిమా చెయ్యాలి అని అనుకునే మా కల కలగానే మిగిలేలా ఉంది అంటున్నారు . ఏది ఏమైనా ప్రేక్షకులకు , అభిమానులకు మాత్రం ప్రతి సినిమా పండుగ వాతావణం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa