టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం జయాపజయాలతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసుకుంటూ చిత్ర సీమలో దూసుకుపోతున్నాడు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే కిరణ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన SR కల్యాణమండపం సినిమాతో కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్నాడు.
తాజాగా ఆయన నటించిన చిత్రం సెబాస్టియన్ పీసీ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే విఫలమైంది. ఈ సినిమా ఫలితం పట్టించుకోకుండా మరో కొత్త సినిమాని లైన్లో పెట్టేసాడు కిరణ్.
గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఒక సినిమాకి కిరణ్ సైన్ చేసాడు. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు చిత్రబృందం. తాజాగా ఈ సినిమా షూటింగును ప్రారంభించినట్టు గీత ఆర్ట్స్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటిస్తుండగా,కిరణ్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa