ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచార్య అంతా ఒకే కానీ..నిడివి సమయంపైనే కాస్త చర్చ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 12:39 AM

ఆచార్య సినిమాపై చిరంజీవి అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. చిరంజీవి .. చరణ్ కథానాయకులుగా కొరటాల 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. చరణ్ - నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అవినీతిపరుల భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. 3 గంటల నిడివి ఓకేనా? బోర్ అనిపిస్తుందా? అనే విషయంలో చిరూ - కొరటాల తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం. ఓ పావుగంట నిడివిని తగ్గిస్తే ఎలా ఉంటుందా అనే విషయం ఇద్దరి మధ్య నలుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సోనూసూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనుండగా, స్పెషల్ సాంగ్ లో రెజీనా మెరవనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa