ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కథలు వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్న డైరెక్టర్ హరీష్ శంకర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 02:25 PM

టాలీవుడ్‌లో OTT సినిమాలు అండ్ వెబ్ సిరీస్‌లు ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్‌గా మారాయి.ఇప్పటికే చాలా మంది తెలుగు దర్శకులు OTT ప్లాటుఫార్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న కొత్త వెబ్ ఒరిజినల్‌ని ప్రారంభించారు.ఈ సిరీస్ కి 'కథలు (మీవీ –మావి)' అనే  టైటిల్ ని ఖరారు చేసారు.ఈ దర్శకుడు ఇప్పటికే ఈ సిరీస్ లోని మూడు కథల షూటింగ్ ని ముగించాడు.మిగిలిన కథల షూట్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి,త్వరలో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,సెన్సషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఈ వెబ్ సిరీస్ మొదటి కథ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.ప్రస్తుతం సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి,శ్రీశ్రీశ్రీ రాజావారు అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa