రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో మొక్కల నాటిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ఆకుపచ్చ చందమామ గా అభివర్ణించారు. ఈ కార్యక్రమం మరింత విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ చెప్పారు. తాను రాసిన ''నేను అడవిని మాట్లాడుతున్నాను" వచన రూప కవిత్వం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ కి బహుమతిగా పంపారు.