ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన పునీత్ రాజ్‌కుమార్ 'జేమ్స్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:11 PM

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్ కనిపించనుంది. ఈ సినిమా అప్పు అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కర్ణాటకలో రికార్డు కలెక్షన్లతో దూసుకుని పోతుంది. ఈ సినిమా ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ని Sony LIV సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే. ఏప్రిల్ 14, 2022న ఈ సినిమాని OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని కిషోర్ పత్తికొండ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa