ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోకవనంలో అర్జున కల్యాణం' నుంచి మరో లిరికల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 10:51 PM

'అశోకవనంలో అర్జున కల్యాణం' నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. విష్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ జోడీగా రుక్షర్ ధిల్లోన్ అలరించనుంది. బాపినీడు -  సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి, జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "గట్టూదాటి పుట్టా దాటి ఏడేడు ఏర్లు దాటి  .. సీమాసింతా నీడకొచ్చానే .. రంగు రంగు రాం సిలకా" అంటూ ఈ పాట సాగుతోంది. విజయ్ కుమార్ - రవికిరణ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట జానపద బాణీలో సాగుతోంది.  ఈ పాటకి యష్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సాంగ్ ఇది. ఇంతవరకూ మాస్ కి కనెక్ట్ అయ్యే  కథలను చేస్తూవు వచ్చిన విష్వక్ సేన్, ఈ సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa