పాండిరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్' సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది. సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది. తాజా అప్డేట్ ప్రకారం, సూర్య డైరెక్టర్ బాలతో ఒక సీరియస్ డ్రామా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య41' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఉప్పెన, శ్యామ్ సింగరై, బంగార్రాజు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కృతిశెట్టి ఈ సినిమాలో సూర్య సరసన జోడిగా కనిపించనుంది అని మేకర్స్ ప్రకటించారు. కృతి శెట్టి ఈ సినిమాకి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, కృతిశెట్టి ఏకంగా కోటి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అండ్ 2D ఎంటర్టైన్మెంట్పై రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa