బాలీవుడ్ సినీ దిగ్గజం రాజ్ కపూర్ నట వారసుడు రిషికపూర్ చనిపోయి రెండేళ్లు కావస్తుంది. ఆయన ఆఖరి చిత్రం శర్మాజీ నంకీన్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆయన లేకపోయినప్పటికీ ఆయన కుమారుడు, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొని ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసారు. తాజాగా రణ్ బీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... "ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన తన అంకుల్ రణధీర్ కపూర్ తన దగ్గరకు వచ్చి, ఈ సినిమాలో మీ నాన్న అద్భుతంగా నటించాడు.. ఒకసారి ఫోన్ చెయ్ ... మాట్లాడాలి" అని రణ్ బీర్ ను అడిగారట. అయితే నాన్న చనిపోయిన విషయం కూడా అంకుల్ మరచిపోయాడని రణ్ బీర్ బాధను వ్యక్తం చేసారు. రణధీర్ కపూర్ మతిమరుపు వ్యాధితో(అల్జీమర్స్) బాధపడుతున్నారని, అయితే ప్రారంభ దశలోనే ఆ వ్యాధి ఉందని మీడియాకి తెలిపారు రణ్ బీర్ కపూర్. రిషికపూర్ సోదరుడు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ తండ్రి రణధీర్ కపూర్. బాలీవుడ్లో హీరోగా కొన్ని సినిమాలలోనే నటించిన రణధీర్ ఆపై నిర్మాతగా కొనసాగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa