ట్రెండింగ్
Epaper    English    தமிழ்

153 థియేటర్లలో మెగా ట్రైలర్ లాంచ్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 04:45 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేవాదాయ భూముల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో చిరు ఎండోమెంట్ అధికారిగా ఒకసారి, నక్సలైట్ గా మరోసారి కనిపించనున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ , చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న, సాయంత్రం 5.40నిమిషాలకు ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  


అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ను సరికొత్తగా ప్లాన్ చేసింది ఆచార్య చిత్రబృందం. ఆచార్య మెగాస్టార్ కు 153 చిత్రం కనుక ట్రైలర్ ని 153 థియేటర్లలో మెగా లాంఛ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ప్రముఖ థియేటర్లలో ఆచార్య ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు థియేటర్ల పేర్లను తెలుపుతూ ఒక లిస్ట్ ను ట్విట్టర్ ద్వారా మేకర్స్ విడుదల చేసారు. దీంతో ఆచార్య రిలీజ్ కు ముందే థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొనబోతుంది. 


మొదటిసారి మెగాస్టార్, చరణ్ కలిసి తెరపై దాదాపు 20 నిముషాలు కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్ర సినిమాకే హై లైట్ గా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెప్తుంది. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa