పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు, మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ప్రొమోషన్స్ కి రంగం సిద్ధమైంది. వచ్చే వారం నుంచి 'సర్కారు వారి పాట' టీమ్ ప్రమోషన్స్ను ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ ఆల్బమ్లోని మూడవ పాటని మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa