ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయసుధ కన్నీరు పెట్టినందుకు మోహన్ బాబుపై వర్మ ధ్వేషం

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 03:26 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఎవరిపై ప్రేమను ఒలకబోస్తారో, ఎవరిపై ధ్వేషం ప్రదర్శిస్తారో ఎవరికీ అంతుపట్టదు. అతిలోక సుందరి శ్రీదేవిని అమితంగా ఆరాధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సహజనటి జయసుధ అన్నా దాదాపు అంతే అభిమానం ఉంది. ఓ సినిమా పోస్టర్ పై ఉన్న జయసుధను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట. 'శివరంజని' సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్ బాబుపై ద్వేషం కూడా పెంచుకున్నారట.


ఆ తర్వాత జయసుధ, మోహన్ బాబులను పెట్టి 2014లో ఆయన 'రౌడీ' సినిమాను తీశారు. జయసుధతో 'మనీ', 'మనీ మనీ' సినిమాను కూడా నిర్మించారు. తాజాగా జయసుధను వర్మ ఆకాశానికెత్తేశారు. 'దైవపుత్రుడు' అనే క్రైస్తవ గీతాన్ని ఆమె పాడారు. ఈ గీతాన్ని ట్విట్టర్ లో వర్మ షేర్ చేశారు. 'జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు' అని ట్వీట్ చేశారు. అంతేకాదు జయసుధ పాటకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ ను కూడా షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa