ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“కేజీఎఫ్2” పై సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు!

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 11:12 AM

ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది కేజీఎఫ్2. కేజీఎఫ్ కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022 న విడుదల అవుతున్న సందర్భం గా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.కేజీఎఫ్ చిత్రం తో భారతీయ సినిమాను ఉర్రూతలుగించారు. అంతేకాక దేశ వ్యాప్తంగా వినిపించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేజీఎఫ్ 2 చిత్రం తో మరోసారి భారతీయ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలని తెలిపారు. చిత్ర యూనిట్ కి విష్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa