కరోనా పాండెమిక్ పుణ్యమా అని ఓటిటి రంగం బాగా అభివృద్ధి చెందింది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,జీ5, సోని లివ్ వంటి ప్రపంచ శ్రేణి ఓటిటి దిగ్గజాలకు ధీటుగా మన తెలుగు వారి అభిరుచి తగ్గట్టుగా సరికొత్త వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన ఏకైక తెలుగు ఓటిటి ఆహా. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మై హోమ్ గ్రూప్ రామేశ్వరరావు తో కలిసి ఆహా ఓటిటి సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. డిజిటల్ రంగంలో నూతన ఒరవడికి తెర లేపిన ఆహా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటుంది. ఈ మేరకు 2022 సంక్రాంతి సందర్భంగా వంద శాతం తమిళ్ కంటెంట్ తో తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఆహా తమిళ్ ను ఎనౌన్స్ చేసారు ఆహా యాజమాన్యం. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోగో లంచ్ కార్యక్రమాన్నిచెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. నేడు అంటే ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఆహా తమిళ్ ఓటిటీని లంచ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరవనున్నారు. ఆయన చేతుల మీదుగానే ఆహా తమిళ్ ఓటిటీ లాంఛ్ జరుగుతుంది. తెలుగులో గ్రాండ్ సక్సెస్ అయిన ఆహా తమిళనాట ఎలాంటి ఆదరణ నోచుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa