జమ్మూకాశ్మీర్లో 1990వ దశకంలో పండిట్స్ను ఊచకోత కోసిన నేపథ్యంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. దేశవ్యాప్తంగా ఈ సిినిమా సంచలనాలను రేకెత్తించింది. కోవిడ్ తర్వాత భారీ విజయాన్ని నమోదు చేసుకుని, రూ.250 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రధాని మోడీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూడాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇక గతంలో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీని కూడా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.
తాజాగా మరో కీలక అంశంపై సినిమా తీయనున్నట్లు ప్రకటించి, సంచలనాలకు తెరలేపారు. మాజీ ప్రధాని ఇందిర గాంధీ మరణానంతరం సిక్కుల ఊచకోత అంశం నేపథ్యంలో 'ది ఢిల్లీ ఫైల్స్' సినిమా తీస్తున్నట్లు తెలిపారు. ‘ది కశ్మిర్ ఫైల్స్’ను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ సంస్థలే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు పంజాబీలోనూ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది అక్టోబర్లో సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa