ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 ఏళ్ళ తర్వాత 'సెల్ఫిష్' మూవీతో కలిసిన దర్శకనిర్మాతలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 09:12 PM

ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'రౌడీ బాయ్స్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2022 జనవరిలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆశిష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పోతే... తాజాగా ఆశిష్ హీరోగా మరో సినిమా లాంచ్ అయింది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు విశాల్ కసి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ రోజు ఉదయం 9.36 గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ క్లాప్ నివ్వగా, టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టాలీవుడ్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు సుకుమార్ తో కలిసి ఈ సినిమాకు పని చేయటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు. పోతే... త్వరలోనే ఈ మూవీ లో నటించబోయే హీరోయిన్ పేరును ఎనౌన్స్ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa