నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, 'ప్రాజెక్ట్ కే' టీమ్ ఈ సినిమా షూటింగ్ కోసం స్పెషల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. డైయ్ అర్రి అలెక్స టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా షూటింగ్ ని చేస్తుండగా, ఈ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి భారతీయ చిత్రంగా 'ప్రాజెక్ట్ కే' నిలిచింది. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa