టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజాహెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మహేష్ బాబు 'SSMB28' సినిమా షూటింగ్ ని జూన్ లేదా జూలైలో ప్రారంభించి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం మే 12న విడుదల కానున్న 'సర్కార్ వారి పాట' షూటింగ్ను పూర్తి చేసే పనిలో మహేష్ బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa