టాలీవుడ్ సక్సెస్ మెషిన్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. చిరు కెరీర్లో 153వ చిత్రం ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ చేస్తూ ఈ సినిమాకు మరింత హైప్ ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరగనుంది. అయితే ఈ వేదికపై ఒక చిన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత ఇటీవలనే శ్రీదేవి.. శోభన్ బాబు అనే సినిమాతో నిర్మాణరంగం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుస్మిత నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి వంటి చిత్రాలతో మంచి విజయాలందుకున్న సంతోష్ శోభన్, గౌరి కిషన్ జంటగా నటిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్, టీజర్లతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చే ప్రయత్నంగా ఆచార్య ప్రీ రిలీజ్ వేదికపై ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చెయ్యాలని సుస్మిత భావిస్తున్నారట. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదలైంది. శ్రీదేవి, శోభన్ బాబులకు మెగా సపోర్ట్ ఎంతవకు ఉపయోగపడుతుందనేది తెలుసుకోవాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa