కరోనా పాండెమిక్ తర్వాత విడుదలైన అఖండ, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి పెద్ద సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ను వసూళ్ల సునామీతో ముంచెత్తాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ సమయం ఆసన్నమైంది. వచ్చే శుక్రవారం ఆచార్య గా రానున్నమెగా తుఫాన్ కు అందరూ రెడీగా ఉండండి.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ తేజ్ ఒక స్పెషల్ రోల్ లో నటిస్తూ తండ్రికి బిగ్ సపోర్ట్ ఇచ్చాడు. కెరీర్లో చిరుకిది 153వ చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఏ సెర్టిఫికెట్ పొందింది. అయితే ఈ మూవీ పై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆచార్య విరామం తర్వాత నుండి కేజీఎఫ్ చిత్రాన్ని తలపిస్తుందట. అక్కడక్కడా కొన్ని సింపుల్ సీన్స్ ఉన్నప్పటికీ, మరికొన్ని సీన్స్ మాత్రం హీరో ఎలివేషన్స్ తో సూపర్ అనేలా ఉంటాయట. సెకండాఫ్ లో చరణ్ ఎంట్రీ, సోనూసూద్ తో ఫైట్, చిరు సింగిల్ టేక్ డైలాగ్స్... ఇలా ఒకదానికి మించి మరొకటి అన్నట్టు అద్భుతంగా సాగుతుందట.
ఇప్పటివరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ టచ్ నిచ్చి హిట్లు కొట్టాడు కొరటాల. మిర్చి, శ్రీమంతుడు తన స్టయిల్ హీరోయిజం చూపించి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాకు కమర్షియల్ టచ్ తో పాటు ఎలివేషన్స్ ను యాడ్ చేస్తున్న కొరటాల ప్రయోగం వర్కౌట్ అవుతుందా? కేజీఎఫ్ ఎలేవేషన్స్ మార్క్ ను ఆచార్య అందుకుంటుందా? ఒకవేళ ఇవన్నీ నిజమైతే కనక ఏప్రిల్ 29న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa