ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిధులుగా హాజరుకానున్న మరో ఇద్దరు సూపర్ స్టార్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 09:16 AM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. 'ఆచార్య' నిర్మాతలు ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ మరియు SS రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. తాజాగా ఇప్పుడు గెస్ట్ లిస్ట్ లోకి మరో ఇద్దరు సూపర్ స్టార్స్ చేరినట్లు సమాచారం. డైరెక్టర్  కొరటాల శివ ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబులను ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa