పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు. హైదరాబాద్లోని RFCలో ఈ మూవీలోని మాస్ సాంగ్ షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa