ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్-సుజీత్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 12:58 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "భీమ్లా నాయక్" సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ బాక్స్ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రభాస్ "సాహో" సినిమా డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ సినిమాకి డైరెక్షన్ చేయనున్నట్లు అందరికి తెలిసిన విషయమే. తమిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన 'థెరి' సినిమాని రీమేక్‌ చేయనున్నారు అని టాక్. యాక్షన్ థ్రిల్లర్ 'థేరి' డబ్బింగ్ వెర్షన్‌ను తెలుగులో 'పోలీస్' పేరుతో దిల్ రాజు విడుదల చేసినప్పటికీ ఈ సినిమా ప్లాప్ టాక్ వచ్చింది. తాజాగా ఇప్పుడు, ఈ ప్రాజెక్ట్ దాదాపు సెట్ చేయబడింది అని సమాచారం. ఈ సినిమాని RRR ఫేమ్ DVV దానయ్య నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజులలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa