ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 12:51 PM

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజాహెడ్గే జంటగా నటించనుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ బిగ్గెస్ట్ హైలైట్ కానుందని సమాచారం. చిరుతో ఫైట్ సీన్ తో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని లేటెస్ట్ టాక్. తండ్రీకొడుకుల యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని, అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa