ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఇంద్రకీలాద్రి కి ఆచార్య చిత్రబృందం

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 03:22 PM

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా పలు మార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్టు తో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ ను ముమ్మరం చేసారు చిత్రబృందం. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ చాలా బిజీగా గడుపుతున్నారు దర్శకుడు కొరటాల శివ మరియు మెగాహీరోలు.


తాజాగా ఆచార్య చిత్రంలో స్పెషల్ రోల్ లో నటించిన రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కాసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రామ్ చరణ్ తేజ్, కొరటాల శివలకు మెగా అభిమానులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa