తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసారు. తాజాగా ఇప్పుడు రేపు హైదరాబాద్లోని దస్పల్లా కన్వెన్షన్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా అక్కినేని నాగార్జున, నాని హాజరుకానున్నారు అని సమాచారం. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa