పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రొడక్షన్ను పూర్తి చేసి రీరికార్డింగ్, ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ఎడిటర్, మార్తాండ్ కె వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ.... మహేష్ బాబు లుక్ చాలా బెస్ట్గా ఉందని, ఈ చిత్రంలో స్టార్ హీరో సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తాడని అన్నారు. అంతేకాకుండా సినిమా బాగా వచ్చిందని యూత్ఫుల్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa