ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెరీర్ అత్యుత్తమ స్థాయిలో నేషనల్ క్రష్ ...

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 09:26 PM

 అభిమానులు నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకునే భామ రష్మిక మండన్నా. ఇప్పటివరకు హిందీలో ఒక్క సినిమా చెయ్యకపోయినా ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ అయిపొయింది. ఛలో చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆపై వరస కమర్షియల్ హిట్లను సొంతం చేసుకుంది. అనతికాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజుకు చేరుకుంది. కన్నడ చిత్రాలతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన రష్మిక అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోల పక్కన ఇప్పటికే నటించి మెప్పించింది. త్వరలోనే తారక్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో కూడా నటించనుంది. తారక్- కొరటాల, రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులలో రష్మికనే లీడ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక తమిళంలో కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ చేస్తున్న రష్మిక ఇలయతలపతి విజయ్ - వంశీపైడిపల్లి సినిమాలో లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సీతారామం లో క్రూషియల్ రోల్ ను పోషిస్తుంది. 


బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్ను చిత్రంతో నార్త్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై చిత్రంలో , టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ లోనూ లీడింగ్ ఫిమేల్ క్యారెక్టర్ పాత్రను పోషిస్తుంది. మొత్తంమీద ఈ కన్నడ భామ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలనే తేడా లేకుండా వరస సినిమాలతో చాలా బిజీగా ఉంది. చేతినిండా పెద్ద సినిమాలతో కెరీర్లోనే అత్యుత్తమ స్థితిలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa