బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా విజయం సాధించాలంటే, బలమైన కథాకథనాలు, తారాగణం, సంగీతం చాలా ముఖ్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక సినిమాకు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చెయ్యటం, తగినన్ని థియేటర్లలో విడుదల చెయ్యటం, కరెక్టు టైములో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటివి చెయ్యకపోవటం వల్ల మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి కూడా.
మే 6న అంటే, వచ్చే శుక్రవారం థియేటర్లలోకి మూడు సినిమాలు రాబోతున్నాయి. సుమ కనకాల ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ, యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకల్యాణం, మరో తెలుగు యువనటుడు శ్రీ విష్ణు నటించిన భళా తందనాన. ఈ సినిమాల విడుదలకు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. దీంతో ఇప్పటికే తన ప్రచార కార్యక్రమాలతో హంగామా చేస్తున్నాడు విశ్వక్. అయితే...ఈ మూడు సినిమాలకు కూడా తెలుగు నుండి ఎటువంటి పోటీ లేదు. తమిళ, మలయాళ, హిందీ ఏంటి ఏ భారతీయ చిత్రం కూడా పోటీగా లేదు. అయితే ఒక హాలీవుడ్ చిత్రం నుండి ఈ మూడు చిత్రాలకు బలమైన పోటీ ఎదురవనుంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర రంగ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ : మల్టివర్స్ అండ్ మ్యాడ్నెస్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 6 న విడుదల కాబోతుంది. మార్వెల్ సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు. ఈ సినిమా కనక థియేటర్లలో క్లిక్ ఐతే, మన మూడు తెలుగు సినిమాలలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా అవి హుష్ కాకి అవడం ఖాయం. చూద్దాం... మే 6న విజేత గా ఎవరు నిలుస్తారో?..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa