టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదలకావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా రానా, సాయి పల్లవి లాంటి ఫ్రెష్ కాంబో పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ సూపర్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని జూలై 1న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.ఈ సినిమాలో జరీనా వాహెబ్, నందితా దాస్, ఈశ్వరీ రావు, నివేదా పేతురేజ్, సాయి చంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa