కరోనా భయాలు వీడినా థియేటర్లతోపాటు ఇంకా ఓటీటీ వంటి ప్లాట్ ఫాంలకు ఇంకా వన్నే తగ్గలేదు. ఇదిలావుంటే విష్వక్సేన్ హీరోగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా రూపొందింది. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. విష్వక్సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించిన ఈ సినిమాకి, తొలి ఆటతోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇంతవరకూ మాస్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన విష్వక్సేన్, మొదటిసారిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇకపై ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను కూడా చేయవచ్చని చెబుతున్నారు. లవ్ .. ఎమోషన్ .. కామెడీని తనదైన స్టైల్లో ఆయన ఆడియన్స్ కి కనెక్ట్ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు 'ఆహా'వారు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల మొదటివారంలో ఈ సినిమాను 'ఆహా' వారు స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa