టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారిపాట మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. మే 12న అంటే రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మహేష్ ను విలేఖరి "ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో జరిగిన మీటింగ్" పై స్పందనను అడగ్గా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తో రెండు మూడు సార్లు ఫోన్ లో మాట్లాడిన సందర్భాలున్నాయి కానీ ఆయనను డైరెక్ట్ గా ఎప్పుడూ కలవలేదు. సినిమా టికెట్ రేట్ల విషయమై ఫిబ్రవరిలోనే ఆయనను తొలిసారి కలవడం జరిగింది. ఆయన నిరాడంబరతను చూసి ఆశ్చర్యపోయాను. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది. చిత్రపరిశ్రమ గురించిన చాలా విషయాలను అడిగి తెలుసుకున్నారు. మా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చెప్పినట్టుగానే టికెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవో ను విడుదల చేసారు. ఆయనతో నా తొలి సమావేశాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను .. అంటూ మహేష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa