సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే ఒక్కరు. ఈ స్టార్ బ్యూటీ ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలలో నటించింది. పూజా ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో భారతదేశం తరపున రెప్రెసెంట్ చేయనుంది అని సమాచారం. ఈ గ్లోబల్ ఈవెంట్ను అలంకరించిన మొదటి పాన్-ఇండియా యాక్ట్రెస్ గా పూజాహెడ్గే నిలిచింది. ఈ సిజ్లింగ్ బ్యూటీ మే 16, 2022న ఫ్రాన్స్కు వెళ్లి 2 రోజుల్లో జరిగే గ్రాండ్ ఈవెంట్కు హాజరవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో పూజాహెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ల సినిమాలో కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'భవధీయుడు భగత్ సింగ్' లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో రొమాన్స్ చేయనుంది. మే 27, 2022న విడుదల కానున్న 'ఎఫ్3' మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా ఈ గ్లామర్ బ్యూటీ కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa