సూర్య, కమల్ హాసన్ ఇద్దరూ కోలీవుడ్లో ప్రముఖ నటులు. ఇప్పుడు వీరిద్దరూ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ హీరోగా త్వరలో రానున్న చిత్రం 'విక్రమ్'లో సూర్య అతిధి పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'విక్రమ్' జూన్ 3న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ మల్టీ స్టారర్లో సూర్య కూడా భాగమయ్యాడనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నాయి.
విక్రమ్ సినిమా టీమ్కి సన్నిహితంగా ఉన్న వర్గాలను మీడియా సంప్రదించినప్పుడు, వారు వార్తలను ధృవీకరించారు. 'విక్రమ్'లో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్నాడని వారు తెలిపారు. ఇటీవల చెన్నైలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను సూర్య పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు. సినిమా క్లైమాక్స్లో సూర్య కనిపిస్తాడని సమాచారం. విక్రమ్ సెట్స్లో సూర్యను కమల్ హాసన్ కౌగిలించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 15న చెన్నైలో జరగనున్న 'విక్రమ్' ఆడియో వేడుకకు సూర్య కూడా హాజరవుతారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa