ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా హెగ్డేకు అరుదైన ఆహ్వానం

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 02:31 PM

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగుతోంది పూజా హెగ్డే. ఇటు సౌత్‌లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్‌లోనూ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం అందుకుంటోంది. అయితే, ప్రస్తుతం పూజాది బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా మిగులుతున్నాయి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాపవడంతో తీవ్ర నిరాశలో ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగులో ఆమెకు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ అయిన సినిమాలు రెండు. వాటిలో ఒకటి మహేశ్ బాబు సరసన, మరొకటి పవన్ కళ్యాణ్ సరసన అని తెలిసిందే.


ఇవి కాకుండా బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ఆ సినిమాలు గనక హిట్ అయితే బాలీవుడ్‌లో ఇంకా అవకాశాలు అందుకుంటుంది. అలాగే, ఇక్కడ కూడా చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఓకే..లేదంటే అమ్మడి కెరీర్ డైలమాలో పడటం గ్యారెంటీ. ఇదే టెన్షన్‌లో పూజా ఉండగా అనుకోకుండా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో ఇక అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.మే 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఇప్పటికే ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి సీనియర్ తారలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పూజాకు అవకాశం దక్కడం విశేషం. అయితే, ఈ అరుదైన అవకాశం వస్తుందని అమ్మడు అస్సలు ఊహించలేదు. 17, 18 తేదీల్లో పూజా కేన్స్‌లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో పూజా ఆ 16వ తేదీన ఇండియా నుంచి పారీస్‌కు బయల్దేరనుంది. ఆ తర్వాత ప్రపంచంలోని టాప్ స్టార్లతో కలిసి పూజా విందులో పాల్గొననుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa