ఆర్ ఆర్ ఆర్ తో తొలి పాన్ ఇండియా సక్సెస్ ను చవిచూసిన రామ్ చరణ్ మరోసారి ఆ రుచి చూడాలనుకుంటున్నాడు. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ ఒక పాన్ ఇండియా సినిమాకు కార్యరూపం ఇస్తున్నాడు. RC #15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్. దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. వరస షెడ్యూల్స్ తో ఎడతెరిపి లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతి కి విడుదల చేస్తామని చిత్రబృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే, ఇప్పుడు ఈ సినిమా ఒక రెండు నెలలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 66వ సినిమా కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఏంటి? అనుకుంటున్నారా? రాంచరణ్ 15వ సినిమాను, విజయ్ 66వ సినిమాను నిర్మిస్తున్నది ఒక్కరే. ఆయనే దిల్ రాజు. రెండు భారీ బడ్జెట్ చిత్రాలను ఒకే సమయంలో విడుదల చేస్తే దిల్ రాజు నష్టాలను కొనుక్కుని తెచుకున్నట్టే. అదీకాక, విజయ్ సంవత్సరానికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఒక్కో సినిమాకు కేవలం నాలుగు నెలల సమయాన్ని మాత్రమే కేటాయిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ మూవీ ఎట్లాలేదన్నా ఈ ఏడాది షూటింగును ముగించుకుని, వచ్చే జనవరిలో విడుదలవుతుంది.
శంకర్ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ అయినా కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడు కాబట్టి ఆయన సినిమానే వాయిదా వేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సెంటిమెంటుతోనే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో చరణ్ నటించిన రంగస్థలం, రాజమౌళి డైరెక్షన్లో నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలు మార్చి నెల చివరిలో విడుదలై చెర్రీ కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ గా,నిలిచాయి. కలెక్షన్ల పరంగా కూడా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగానే రాబట్టాయి. అందుకనే శంకర్ తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ 15వ సినిమాను కూడా మార్చి నెల చివరిలో విడుదల చెయ్యాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa