ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవీణ్ సత్తారు తదుపరి ప్రాజెక్ట్‌లపై లేటెస్ట్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 02:10 PM

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు ఒకరు. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జునతో 'ఘోస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు మరియు శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ జి. గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ నెలాఖరులోగా 'ఘోస్ట్' సినిమాను ముగించి ఈ యాక్షన్ డ్రామాని పోస్ట్ ప్రొడక్షన్ పనులని ప్రారంభించనున్నారు అని సమాచారం. అంతేకాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa