వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'విరాట పర్వం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రానా అభిమానులు అండ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అతి త్వరలో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో విరాట పర్వం థియేట్రికల్ ట్రైలర్ను జూన్ 5, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.