టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ని ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, మూవీ టీమ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.