ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు శిల్పకళావేదికలో "విరాటపర్వం" ప్రీ రిలీజ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 04:10 PM

దగ్గుబాటి రానా, సాయిపల్లవి తొలిసారి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. 1990ల కాలంలో ఉత్తర తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని, నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు వేణు ఉడుగుల డైరెక్టర్ కాగా, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీతమందించిన ఈ చిత్రం జూన్ 17న విడుదలవడానికి రెడీగా ఉంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో గత వారం నుండి చిత్రబృందం ప్రచార కార్యక్రమాలతో ఒకరేంజులో ఊదరగొట్టేస్తుంది. మొన్న కర్నూల్ లో, నిన్న వరంగల్ లో తాజాగా రేపు హైదరాబాద్ లో విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం, హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం ఆరు గంటల నుండి విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ముఖ్య అతిధులుగా ఎవరు హాజరవబోతున్నారన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, అందుతున్న సమాచారం ప్రకారం, విక్టరీ వెంకటేష్ గారు విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa