వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'విరాట పర్వం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రానా అభిమానులు అండ్ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట పర్వం సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈరోజు హైదరాబాదులో శిల్పకళా వేదికలో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ హరిజరుకానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.