అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెండో పాటను ఏంటోఎంటేంటో అనే టైటిల్ తో జూలై 16 సాయంత్రం 5 గంటలకు గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా జూలై 8న భారీగా విడుదల కానుంది. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.