టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూలై 13, 2022 న ప్రారంభమవుతుంది అని సమాచారం. ఈ కొత్త షెడ్యూల్లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ షెడ్యూల్లో మాస్ ఇంట్రో సాంగ్ని చిత్రీకరిస్తారన్నది లేటెస్ట్ టాక్. ఈ సినిమా 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.