ఇప్పటి వరకు చేసింది ఆరు సినిమాలే. కానీ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. శివ కార్తికేయన్ కు జంటగా డాక్టర్, జాన్ సినిమాల్లో నటించింది. 'ఈటీ' కోసం సూర్యతో జతకట్టింది. అప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ -మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా (2#SSMB28) రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్గే ను తీసుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రియాంక మోహన్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అంతేకాదు.. మహేష్ తో ఆమెకు రొమాన్స్ సీన్స్ ఉండనున్నాయట. ఈ సినిమా 'అతడు' సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. పార్టు, అర్జునుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్. హారిక & హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.