ఖలేజా తరవాత దాదాపు పదకొండేళ్లకు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ ల కలయికలో ఒక సినిమా రాబోతుంది. ఈ నెల నుండే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. చాన్నాళ్ల తరవాత రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాతో ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేణుకి, మహేష్ సినిమాలో అవకాశం రావడమంటే చాలా గ్రేట్. దీంతో మున్ముందు వేణు మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో భాగం కావొచ్చని తెలుస్తుంది. కానీ, SSMB 28లో వేణు కీలక పాత్ర పోషిస్తున్నాడన్న విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మింపబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa