తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలలో భారతదేశపు తొలి పిన్న వయస్సు స్వాతంత్య్ర సమరయోధుడు "ఖుదీరాం బోస్" బయోపిక్ గా అదే టైటిల్ తో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి శ్రీ. వెంకయ్య నాయుడుగారి చేతులమీదుగా ఈ మూవీ యొక్క టైటిల్ పోస్టర్ ఇటీవలే విడుదలయ్యింది. దీంతో ఈ మూవీ పై అందరు ప్రత్యేక ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.
ఈ సినిమాను విద్యాసాగర్ రాజు డైరెక్ట్ చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గోల్డెన్ రైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జాగర్లమూడి రజిత విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ లను లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు విడుదల చెయ్యనున్నారు.