కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా రెండు భాగాలుగా రూపొందుతోంది అని సమాచారం. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సెప్టెంబరులో జరిగే పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ అండ్ కమల్ హస్సన్ ని తీసుకొని రావడానికి డైరెక్టర్ మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు మూవీ మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.