బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ మల్తోత్రా తన కోస్టార్ కియారా అద్వానీతో సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరూ జంటగా నటించిన 'షా' మూవీ ఆగస్టు 12తో ఏడాది పూర్తిచే సుకున్న సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో అభిమానులతో ముచ్చటించారు. ఈ మూవీ షూటింగ్ కోసం చండీగఢ్ నుంచి పాలంపూర్ సమీపంలోని ఒక మఠానికి చేరేందుకు లాంగ్ జర్నీ చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. కారులో తామిద్దరం పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎవరి పనుల్లో వాళ్లు లీనమైపోయామని, అయితే కియారా ప్రైవేసీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపాడు. మరోవైపు కియారా మాత్రం ఆ టైమ్ లో తన ఇన్నర్ ఫీలింగ్స్ బయటకు రాలేదని, దేనిగురించి మాట్లాడాలో కూడా ఆర్థం కాలేదని పేర్కొంది. కానీ సిద్దార్తో చేసిన జర్నీలో ఏదో తెలియని అనుభూతిని పొందినట్లు వెల్లడించింది. ఇక తమకలయికలో మరో సినిమా రాబోతుందంటూ అభి మానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈ జోడీ.. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లువార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.