టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇటీవల విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచినా కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్లో భాగం అవుతున్నట్లు లేటెస్ట్ టాక్. ఈసారి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో యాక్షన్ డోసేజ్ ఎక్కువగా ఉంటుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |